యువకుల వేధింపులు..సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువతి ఆత్మహత్య

యువకుల వేధింపులు..సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువతి ఆత్మహత్య

నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్  విద్యార్ధిని రమ్య సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..నెల్లూరు భక్తవత్సల నగర్ కు చెందిన విద్యార్ధిని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తాను ఉరేసుకుంటున్నాంటూ దిగిన  ఓ సెల్ఫీ వీడియోను  ముగ్గురు యువకులకు షేర్ చేసింది. బాధితురాలి ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తలుపుల్ని బలవంతంగా ఓపెన్ చేసి చూశారు.  అప్పటికే మృతురాలు చనిపోయి విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా కాలేజీలో విద్యార్ధుల వేధింపుల వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి పంపిన వీడియోల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.