పెళ్లికి ఒప్పుకోలేదని కత్తితో పొడిచిండు

పెళ్లికి ఒప్పుకోలేదని కత్తితో పొడిచిండు

కర్ణాటకలోని బెంగళూరులో బీటెక్ చదువుతోన్న ఓ విద్యార్థినిని, ఓ యువకుడు కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. స్థానిక ప్రెసిడెన్సీ కళాళాలలో ఇంజినీరింగ్ చదువుతున్న లయస్మిత అనే విద్యార్థిని..నృపతుంగ యూనివర్సిటీలో బీసీఏ చదువుతున్న పవన్ కల్యాణ్ ఇద్దరు దూరపు బంధువులు. వారిద్దరూ ఒకరికొకరు బాగా తెలుసని కూడా పోలీసులు తెలిపారు. అయితే పెళ్లి చేసుకోవాలని లయస్మితను పవన్ పలుమార్లు బలవంతం చేసినట్టు తెలుస్తోంది. దీనికి ఆమె నో  చెప్పడంతో  పవన్.. ఆ యువతి చదువుతున్న కాలేజీకి వెళ్లి కత్తితో దారుణంగా పొడిచినట్టు సమాచారం. ఆ తర్వాత తనను తాను ఛాతిపై పొడుచుకున్నాడని ఓ పోలీస్ అధికారి తెలిపారు.

ఘటన జరిగిన వెంటనే అక్కడే ఉన్న లయస్మిత స్నేహితులు, కళాశాల సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమెను హాస్పిటల్ కు తరలించేలాగా ప్రాణాలు విడిచిందని పోలీసులు చెప్పారు. పవన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు.  గత మూడు నాలుగేళ్లుగా లయస్మిత తల్లిదండ్రులను తనకు, తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేయమని పవన్‌ అభ్యర్థిస్తున్నా.. వారు నిరాకరించినట్టు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో ఆమె తల్లి కూడా అతడిని హెచ్చరించిందని బెంగళూరు రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మల్లికార్జున్ బాల్దండి తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు జరుపుతున్నట్టు స్పష్టం చేశారు.