కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో మెరిట్ రివార్డ్ ప్రోగ్రాంను శుక్రవారం ప్రారంభించారు. అర్హులైన విద్యార్థులకు వచ్చే సెమిస్టర్నుంచి సెమిస్టర్ పరీక్ష ఫీజును చెల్లిస్తామని ఫోరం అధ్యక్షుడు రాహుల్నాయక్తెలిపారు. పరీక్షల్లో 9.0 లేదా అంతకంటే ఎక్కువ సీజీపీఏ సాధించినవారు లేదా 95 శాతం కంటే ఎక్కువ హాజరు నమోదు చేసిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.
