బ్యాటరీల తయారీకి రూ.21 వేల కోట్ల విలువైన రాయితీలు

బ్యాటరీల తయారీకి రూ.21 వేల కోట్ల విలువైన రాయితీలు

న్యూఢిల్లీ: క్లీన్​ ఎనర్జీని ఎంకరేజ్​ చేయడంలో భాగంగా ఎలక్ట్రిసిటీ గ్రిడ్​ బ్యాటరీలను తయారు చేసే కంపెనీలకు రూ.21 వేల కోట్ల విలువైన సబ్సిడీలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బ్యాటరీ సెల్స్​తయారీ యూనిట్లను ఇండియాలోనే నిర్మించే కంపెనీలకు పీఎల్​ఐ స్కీము కింద సబ్సిడీలను ఇస్తారు. 

2030 వరకు కంపెనీలు వీటిని పొందవచ్చు. చైనా బ్యాటరీలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ‘‘మనం బొగ్గు ఆధారిత కరెంటు ఉత్పత్తిని తగ్గించాలి. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్​ను తయారు చేయడానికి వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే చైనాపై ఆధారపడటం మరింత  పెరుగుతుంది” అని ప్రపోజల్​ డాక్యుమెంటులో ఎక్స్​పర్టులు పేర్కొన్నారు.