
న్యూఢిల్లీ: క్లీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేయడంలో భాగంగా ఎలక్ట్రిసిటీ గ్రిడ్ బ్యాటరీలను తయారు చేసే కంపెనీలకు రూ.21 వేల కోట్ల విలువైన సబ్సిడీలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బ్యాటరీ సెల్స్తయారీ యూనిట్లను ఇండియాలోనే నిర్మించే కంపెనీలకు పీఎల్ఐ స్కీము కింద సబ్సిడీలను ఇస్తారు.
2030 వరకు కంపెనీలు వీటిని పొందవచ్చు. చైనా బ్యాటరీలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ‘‘మనం బొగ్గు ఆధారిత కరెంటు ఉత్పత్తిని తగ్గించాలి. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్ను తయారు చేయడానికి వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే చైనాపై ఆధారపడటం మరింత పెరుగుతుంది” అని ప్రపోజల్ డాక్యుమెంటులో ఎక్స్పర్టులు పేర్కొన్నారు.