చంద్రయాన్ 3 విజయం చాలా గొప్పదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ విజయం ఎంత పెద్దదంటే దానిపై ఎంత చర్చ జరిగినా తక్కువే అనిపిస్తుందన్నారు. మన్ కీ బాత్ 104వ ఎపిసోడ్ లో మోదీ ఈ కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వైపరీత్యాలపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యమునా నదిలో వరదలు, కొండ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడటం వంటి ఇతర సంఘటనలపై చర్చించారు.
పర్యావరణానికి సంబంధించి చెట్ల పెంపకం, నీటి సంరక్షణపై కూడా ఆయన ఉద్ఘాటించారు. నీటి సంరక్షణ కోసం చేస్తున్న కృషిని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్లోని షాదోల్ ప్రాంతంపై చర్చించారు. ఇటీవల ముగిసిన వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్ 2023లో పతకాలు సాధించిన ప్రగతి, ఆమ్లాన్, ప్రియాంక లతో ప్రధాని మోదీ మాట్లాడారు.
2014 అక్టోబర్ 3 నుండి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. మోదీ ఒకే నెల (ఆగస్టు)లో రెండుసార్లు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించడం ఇదే తొలిసారి.