హైదరాబాద్,వెలుగు : సీపీఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ ను పునరుద్ధరించాలని ఈనెల 16 నుంచి సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ చేపట్టనున్న " పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర"కు గ్రూప్ –1 అధికారుల సంఘం మద్దతు ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్ ను శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, సెక్రటరీ హనుమంతు నాయక్ తదితరులు ఆవిష్కరించారు.
