ఓటుకు నోటు కేసు విచారణ ఏప్రిల్‌కు వాయిదా

ఓటుకు నోటు కేసు విచారణ ఏప్రిల్‌కు వాయిదా

 ఢిల్లీ: ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు పాత్రపై  నిగ్గుతేల్చాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

ఆళ్ల దాఖలు చేసిన పిటీషన్‌పై జస్టిస్ ఎం ఎం సుందరేశ్, జస్టిస్ ఎస్వీ ఎన్ బట్టి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అయితే తమకు మరికొంత సమయం కావాలంటూ ప్రతివాది రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదుల విజ్ణప్తి చేశారు. దీంతో కేసు విచారణను ధర్మాసనం ఏప్రిల్‌కు వాయిదా వేసింది.