బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాకు క్రికెట్ అంటే ఎంతో పిచ్చో అందరికీ తెలుసు ఆ మధ్య లండన్ లో దొంగ చాటుగా క్రికెట్ చూడటానికి వచ్చి మీడియాకు దొరికిపోయాడు. ఇక ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ యజమాని అయిన విజయ్ మాల్యా లేటెస్ట్ గా ఆర్సీబీ కొత్త లోగోపై స్పందించాడు. సింహాల్లా గర్జించండి కానీ ఐపీఎల్ ట్రోఫీని బెంగళూరుకు తీసుకురావాలంటూ ట్వీట్ చేశారు. ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఐపీఎల్ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్నారన్నారు.
ఇక ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ అండర్ 19 నుంచే ఆర్బీబీ టీంలోకి వచ్చాడన్నారు.టీమిండియాకు ఎన్నో విజయాలనందించిన కోహ్లీ జట్టు విజయపథంలో నడిపిస్తున్నాడన్నారు. కోహ్లీకి స్వేఛ్చనిస్తే కప్పు ఖాయమని ఆర్సీబీకి సూచించాడు.
Sure..Roar load like a Lion but bring the IPL trophy home to Bangalore. https://t.co/Ix3bhoOIlG
— Vijay Mallya (@TheVijayMallya) February 15, 2020
Virat came to RCB from the India U 19 squad. Virat has led India to great success and has been an outstanding performer himself. Leave it to him and give him the freedom. All RCB fans want that long overdue IPL trophy. https://t.co/RT7cNdWgWN
— Vijay Mallya (@TheVijayMallya) February 15, 2020