
మౌంట్ మాంగనుయ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ వీరవిహారం చేశాడు. కేవలం 51 బంతుల్లో 111 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇందులో11 ఫోర్లు, 7 సిక్స్లున్నాయి. ఈ మ్యాచ్ తో సూర్య పలు రికార్డులు సృష్టించాడు. టీ20ల్లో న్యూజిలాండ్ గడ్డపై సెంచరీ కొట్టిన తొలి భారతీయుడుగా సూర్య రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా ఒక క్యాలెండర్ ఇయర్లో టీ20ల్లో రెండు సెంచరీలు సాధించిన రెండో భారతీయుడిగా సూర్య రికార్డు సృష్టించాడు. 2018 లో రోహిత్ శర్మ ఒక క్యాలెండర్ ఇయర్లో రెండుసెంచరీలు చేశాడు.
న్యూజిలాండ్ టార్గెట్192
సూర్యకుమార్ సెంచరీతో రెండో టీ 20 మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భారత బ్యాట్స్ మెన్ లలో ఇషాన్ కిషన్ (36), రిషభ్ పంత్ (6), శ్రేయస్ అయ్యర్ (13), హార్దిక్ పాండ్య (13) పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలర్ సౌథీ హ్యాట్రిక్ విశేషం. సౌథీ కెరీర్లో ఇది రెండో హ్యాట్రిక్. సౌథీ19వ ఓవర్ లో వరుస బంతుల్లో హార్దిక్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ ల వికెట్లను తీశాడు.