సూర్యకుమార్ యాదవ్ ముగింట అరుదైన రికార్డు

సూర్యకుమార్ యాదవ్ ముగింట అరుదైన రికార్డు

టీమిండియా సెన్సేషన్ సూర్యకుమార్ యాదవ్ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తున్నాడు. ఇప్పటికే ఓకే ఏడాది వ్యవధిలో 3 టీ20 సెంచరీలు చేసిన సూర్యకుమార్ ముంగిట ఇప్పుడు మరో ఆరుదైన రికార్డు చేరువలో ఉంది. ప్రస్తుతం టీ20  ర్యాంకింగ్స్‌లో 889 పాయింట్లతో ఉన్న సూర్యకుమార్ .. త్వరలోనే 900 పాయింట్లను అందుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు టీ20  చరిత్రలో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్  ఫించ్ మాత్రమే ఈ ఫీట్ ను సాధించారు. ఈ జాబితాలో సూర్య  చేరితే కనుక తొలి భారత క్రికెటర్  అవుతాడు. 

ఇటీవల శ్రీలంకపై అద్భుత సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో అత్యధిక వేగంగా 1500 పరుగులు చేసిన ఆరో బ్యాట్స్మన్గా రికార్డు క్రియేట్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 43వ ఇన్నింగ్స్లో సూర్య ఈ రికార్డును సృష్టించాడు. ఈ జాబితాలో కోహ్లీ, ఫించ్ ,బాబర్ ఆజమ్, కేఎల్ రాహుల్, మహ్మద్ రిజ్వాన్‌లు ఉన్నారు. లంకతో జరిగిన ఈ  మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లో 112 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.  ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో మూడో టీ20  సెంచరీని నమోదు చేశాడు. దీంతో టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో భారత బ్యాట్స్మన్ గా నిలిచాడు.  రోహిత్ శర్మ నాలుగు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.