డాక్టర్లు లేరని నర్సులు డెలివరీ.. శిశువు మృతి

డాక్టర్లు లేరని నర్సులు డెలివరీ.. శిశువు మృతి

సూర్యాపేట జిల్లా   కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో  దారుణం జరిగింది.  వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గర్భిణీకి నర్సులు డెలివరీ చేశారు. దీంతో  శిశువు మృతి చెందింది. 

బాధితురాలు నడిగూడెం మండలం కరివిరాల గ్రామానికి చెందిన మానస డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. మంగళవారం ఉదయం నొప్పులు రావడంతో  సిబ్బంది డాక్టర్ కు సమాచారం ఇచ్చారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సులు డెలివరీ చేశారు. పసికందుకు సీరియస్ గా ఉందని నర్సులు హడావుడి చేశారు. ఆస్పత్రిలో  చిన్న పిల్లల వైద్యులు కూడా అందుబాటులో లేకపోవడం, ఆలస్యం కావడంతో శిశువు మృతి చెందింది.

నర్సుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందినట్లు బంధువుల ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ  బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆస్పత్రి దగ్గరకు జనం భారీగా చేరడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.