సుశాంత్ కు ఆర్ధిక స‌మ‌స్య‌లు లేవు : నిర్ధారించిన ఈడీ అధికారులు

సుశాంత్ కు ఆర్ధిక స‌మ‌స్య‌లు లేవు : నిర్ధారించిన ఈడీ అధికారులు

దివంగ‌తం హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎలాంటి ఆర్ధిక సంక్షోభంలో లేర‌ని ఈడీ అధికారులు నిర్ధారించారు.

రియా అమె కుటుంబ‌స‌భ్యులు, సిబ్బంది మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈడీ అధికారులు మ‌నీలాండ‌రింగ్ కేసులో సుశాంత్ సింగ్ ఆర్ధిక లావాదేవీల‌పై ఆరాతీశారు.

ఈ ద‌ర్యాప్తులో భాగంగా క్వాన్ టాలెంట్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ భాగస్వామంలో రెండు మూడేళ్ల‌లో ప‌లు ప్రాజెక్ట్ లు చేశార‌ని, ఆ ప్రాజెక్ట్ ల వ‌ల్ల 30 నుంచి 35కోట్ల వ‌ర‌కు సంపాదించార‌ని టాలెంట్ మేనేజ‌ర్ జ‌యంతి సాహా వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ ల‌కు సంబంధించిన బ్రాండ్ డాక్యుమెంట్లు, స్టేట్మెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏజెన్సీ భాగ‌స్వామ్యంలో ప‌లు ప్రాజెక్ట్ లు చేసినా అందులో ఎక్కువ శాతం నిధులు సుశాంత్ వేన‌ని ఈడీ అధికారులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.ఈ విచార‌ణ‌లో సు శాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇతర కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ సైతం ఈడీ అధికారులు రికార్డ్ చేసిన‌ట్లు తెలుస్తోంది.