
హైదరాబాద్, వెలుగు: ఐదో ఎడిషన్ ఐఐపీపీఎల్ టీ20 చాంపియన్షిప్లో టీమ్ మార్షల్ విజేతగా నిలిచింది. మొయినాబాద్లో మంగళవారం జరిగిన ఫైనల్లో మార్షల్ 14 రన్స్ తేడాతో టీమ్ రాయల్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మార్షల్ నిర్ణీత 20 ఓవర్లలో 129/8 స్కోరు చేసింది. ఛేజింగ్లో రాయల్ ఓవర్లన్నీ ఆడి 115/7 స్కోరు మాత్రమే చేసి ఓడింది. మార్షల్ ఆటగాడు కృష్ణాకర్ 12 రన్స్తో పాటు మూడు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. టోర్నీలో 199 రన్స్ చేసిన రాయల్ టీమ్ బ్యాటర్ అబ్దుల్ మునీర్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా ఎంపికయ్యడు.