2026 టీ20 వరల్డ్ కప్ ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. వరల్డ్ కప్ కు రెండు నెలల కంటే తక్కువ సమయం ఉండడంతో ఐసీసీ క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఐసీసీ గురువారం (డిసెంబర్ 11) భారత కాలమాన ప్రకారం సాయంత్రం 6:45 గంటల నుండి టిక్కెట్ల అమ్మకాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రారంభ స్థాయి టిక్కెట్లు చాలా తక్కువ ధరకే ఉండడం విశేషం. కొన్ని మ్యాచ్ ల టికెట్ ధరలు కేవలం రూ. 100 నుండి ప్రారంభమవుతాయి.
ఇండియాలో టిక్కెట్లు ఎక్కడ కొనాలి?
ఇండియాలో క్రికెట్ ఫ్యాన్స్ BookMyShow ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. టికెట్ కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా యాప్ లేదా వెబ్ ద్వారా అప్లికేషన్లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత వారు తమ సీట్లను బుక్ చేసుకోవడానికి, వ్యక్తిగత వివరాలను పూరించాల్సి ఉంటుంది. పేమెంట్ చెల్లించిన తర్వాత వినియోగదారుడు ఇమెయిల్ రూపంలో అన్ని వివరాలను అందుకుంటాడు. టికెట్ల అమ్మకాల ప్రకటన తర్వాత బీసీసీఐ కార్యదర్శి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. టికెట్ లోయస్ట్ ప్రెస్ రూ. 100 ఉండడంతో ఫ్యాన్స్ అతి తక్కువతో ప్రపంచ స్థాయి మ్యాచ్ లు ఆస్వాదించవచ్చని దేవ్ జిత్ సైకియా అన్నారు.
క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా, ఫ్యాన్స్ థ్రిల్లింగ్ గా ఫీలయ్యే ఇండియా-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఇండియా, పాకిస్తాన్ , అమెరికా(USA), నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఒమన్, వెస్టిండీస్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ జట్లు టోర్నమెంట్ లో భాగం కానున్నాయి.
భారత్లో జరిగే మ్యాచ్ లు 5 స్టేడియాల్లో జరుగుతాయి. అహ్మదాబాద్, దిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబయి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక శ్రీలంక లో 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్ మ్యాచ్లు అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.

