హర్యానాలో టైక్వాండో ప్లేయర్ హత్య

హర్యానాలో టైక్వాండో ప్లేయర్ హత్య

హర్యానాకు చెందిన 25 ఏళ్ల టైక్వాండో ప్లేయర్ సరిత హత్యకు గురైంది. ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నం గురుగ్రామ్ గ్రామంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆమె చనిపోయింది. అయితే ఈ హత్య వెనక కోచ్ హస్తం ఉందని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ కోచ్ అనేక సార్లు ఆమె వెంటపడ్డాడని, అందుకామె ఒప్పుకోక పోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడని వారు ఆరోపించారు. 2013 నుంచి సరితకు ఆ కోచ్ తెలుసని వారు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న గురుగ్రామ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలిని సరితగా గుర్తించారు. ఓ యువకుడు కాల్పులు జరిపి పారిపోయినట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తర్వాత కోచ్ కన్పించకుండా పోవడంతో.. అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు పోలీసులు.