
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) సహనం కోల్పోయారు. తన సినిమా ప్రెస్ మీట్ లో ఓ రిపోర్టర్ పై మండిపడ్డారు. మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు అంటూ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విరాల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ మెర్రీ క్రిస్మస్. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా చెన్నైలో ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా ఓ రిపోర్టర్.. గత 75 ఏళ్లుగా తమిళ రాజకీయాలు హిందీ భాష వ్యతిరేకత చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ఇప్పటికీ నాకు హిందీ రాదు అనే టీషర్టులు ధరిస్తున్నారు దానిపై మీ స్పందన ఏంటి? అని అడిగారు. దానికి సహనం కోల్పోయిన విజయ్ సేతుపతి.. భాషగా హిందీని ఎవరూ వ్యతిరేకించలేదు. అని అనగానే మధ్యలో మైక్ అందుకున్న అదే రిపోర్టర్.. హిందీ భాష నేర్చుకోవడం తప్పనిసరా? అని అడిగాడు.
దీంతో ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు విజయ్ సేతుపతి.. ఇదే ప్రశ్నను మీరు ఆమిర్ ఖాన్ను కూడా అడిగారు. అదే ప్రశ్నను మళ్లీ మళ్లీ ఎన్నిసార్లు ఎంతమందిని అడుగుతారు. హిందీ భాషకు మేం వ్యతిరేకం కాదు.. ఆ భాషను తప్పనిసరి చేయడంపైన మాత్రమే మా వ్యతిరేకత. రెండింటీ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ విషయమై మంత్రి త్యాగరాజన్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో ఒకసారి చూడండి.. అని చెప్పుకొచ్చారు విజయ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.