బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు..11 మంది మృతి

బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు..11 మంది మృతి

తమిళనాడు అరియలూరు జిల్లాలోని ఓ క్రాకర్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ లో 11 మంది మృతి చెందారు. వీరకలూరులోని క్రాకర్స్ షాపులో పటాకులు తయారు చేస్తుండగా ఒక్కసారి పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. అటు దుకాణంలో నిల్వచేసిన క్రాకర్స్ కు మంటలంటుకోవటంతో భారీ శబ్దంతో మంటలు వ్యాపించాయి. అరియలూరుతోపాటు సమీప  ప్రాంతాల నుంచి వచ్చిన ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చారు. 

దీపావళికి మరో నెలరోజుల సమయమే ఉండటంతో.. ముడిసరుకులు భారీగా నిల్వఉంచారు. గాయపడిన 12 మంది కార్మికుల పరిస్థితి సీరియస్ గా ఉండటంతో సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

అటు క్రాకర్స్  తయారీలో 35 మందికి స్థానికులతోపాటు మరో పది మంది విరుదునగర్ జిల్లా శివకాశికి చెందినవారుగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. షాప్ లో మంటలు ఎలా చెలరేగాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.