ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి

ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి

ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు కరోనా పాజిటివ్ గా నిర్థరణ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. అయితే తాజాగా ఆయన కొవిడ్ స్వల్ప లక్షణాలతో చెన్నై అల్వార్‌పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. దాని సంబంధిత లక్షణాల అబ్జర్వేషన్ కోసం హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్టు కావేరీ హాస్పిటల్ యాజమాన్యం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇదిలా ఉండగా మంగళవారం ఎంకే స్టాలిన్ కు కరోనా ఇన్ఫెక్షన్, స్వల్ప లక్షణాల కారణంగా సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఈ సందర్భంగా అందరూ మాస్క్ ధరించాలని, వ్యాక్సిన్ లు వేసుకోవాలని కోరారు.