చెస్ ఒలంపియాడ్ పోటీలకు రండి

చెస్ ఒలంపియాడ్ పోటీలకు రండి

హైదరాబాద్, వెలుగు: చెన్నైలో జరగనున్న 44 వ ఫైడ్ అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ పోటీలకు హాజరుకావాల్సిందిగా సీఎం కేసీఆర్ ను  తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానించారు. స్టాలిన్ తన పార్టీ రాజ్యసభసభ్యుడు గిరిజానన్ ద్వారా శుక్రవారం ప్రగతి భవన్ కు ఆహ్వాన లేఖను పంపించారు. వ్యక్తిగత పిలుపుగా భావించి ఈనెల 28న ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని  సీఎం స్టాలిన్ కోరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు గిరిజానన్.. శాలువా కప్పి, జ్జాపికను అందజేసి ఇన్విటేషన్ ఇచ్చారు.188 దేశాల నుంచి చెస్ క్రీడాకారులు పోటీలో పాల్గొంటున్నారని..దేశంలో మొదటిసారిగా, ఆసియాలో మూడోసారి జరుగుతున్న  ప్రతిష్టాత్మక పోటీలని పేర్కొన్నారు.