బీభత్సం సృష్టించిన ‘బురేవి’.. తుపాను ధాటికి ‌ఏడుగురి మృతి

బీభత్సం సృష్టించిన ‘బురేవి’.. తుపాను ధాటికి ‌ఏడుగురి మృతి

చెన్నై: తమిళనాడులో బురేవి తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల ధాటికి ఏడుగురు మృతిచెందారు. రాష్ట్రంలో తుపాను పరిస్థితిపై సీఎం పళనిస్వామి సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు 11మంది మంత్రులను నియమించారు. వరదల్లో మృతిచెందిన వారికి రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ తుపాను ప్రభావంతో అత్యధికంగా కడలూరు జిల్లాలో వర్షాలు కురిశాయి. 1725 గుడిసెలు, 410 పెంకిటిళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లు దెబ్బతిన్నవారికి, మూగజీవాలు నష్టపోయిన రైతులకు సీఎం పరిహారం ప్రకటించారు. ఈ వర్షాల ధాటికి 66 చెట్లు, 27 విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. మరోవైపు, సహాయక చర్యల కోసం 14 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు.