ఫిలింఛాంబర్ కు భారీగా తరలివస్తున్న అభిమానులు

ఫిలింఛాంబర్ కు భారీగా తరలివస్తున్న అభిమానులు

నందమూరి తారకరత్న భౌతిక కాయాన్ని ఫిలింఛాంబర్ కు  తీసుకొచ్చారు. మోకిల నుంచి ఫిల్మ్‌ ఛాంబర్‌కు పార్థివదేహాన్ని తరలించారు. బాలకృష్ణ, విజయసాయిరెడ్డి  అంబులెన్స్ లో తారకరత్న భౌతికకాయం పక్కనే కూర్చున్నారు. తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించుకునేందుకు పలువురు రాజకీయనాయకులు, అభిమానులు,  భారీగా తరలివస్తున్నారు. సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.

తారకరత్న గుండెపోటుతో 23 రోజలుగా బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మోకిలలోని తారకరత్న ఇంటి వద్ద ఆయన భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు.