భద్రతా సిబ్బంది లక్ష్యంగా… IED అమర్చిన ఉగ్రవాదులు

భద్రతా సిబ్బంది లక్ష్యంగా… IED అమర్చిన ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్‌లో రాజౌరి జిల్లాలో బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు చేసిన యత్నాన్ని భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. భద్రతా సిబ్బందే లక్ష్యంగా రహదారి పక్కన అతి శక్తివంతమైన IED లను అమర్చారు. వీటిని గుర్తించిన జవాన్లు బాంబు స్క్వాడ్‌ సాయంతో నిర్వీర్యం చేశారు

ఇవాళ(సోమవారం) ఉదయం ఆర్మీ రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీ(ROP) విభాగానికి చెందిన జవాన్లు జమ్ము-పూంఛ్‌ హైవేపై పెట్రోలింగ్‌ చేస్తుండగా.. రాజౌరీ జిల్లా కల్లార్‌ చౌక్‌ సమీపంలో అనుమానాస్పద వస్తువులను గుర్తించారు. దీంతో వెంటనే వారు పోలీసులు, ఆర్మీ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. భద్రతాసిబ్బంది దాన్ని పరిశీలించగా.. ఐఈడీ అమర్చినట్లు తెలిసింది. దీంతో రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు. బాంబును ముందుగానే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు పోలీసులు.