పల్లెటూరి నేపథ్యంలో.. 

పల్లెటూరి నేపథ్యంలో.. 

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా సంజీవ్ ఎఆర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, సాధిక్, ఆదిత్య పిట్టీ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. లీడ్​ యాక్టర్స్ అంతా షూట్‌‌‌‌లో పాల్గొంటున్నారు. శుక్రవారం హీరోయిన్ ఈషా రెబ్బా పుట్టినరోజును సెట్స్‌‌‌‌లో సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన స్టిల్స్‌‌‌‌లో తరుణ్ భాస్కర్, ఈషా.. ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్‌‌‌‌లో పల్లెటూరి జంటగా కనిపిస్తున్నారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని ఈ సందర్భంగా నిర్మాతలు చెప్పారు. బ్రహ్మాజీ, శివన్నారాయణ, సురభి ప్రభావతి ఇతరపాత్రలు పోషిస్తున్నారు. జై క్రిష్ సంగీతం అందిస్తున్నాడు.