- వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు
న్యూఢిల్లీ: ‘‘అమెరికాలో 9 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల కోసం డెంగ్యూ వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్లో కూడా డెంగ్యూ నివారణకు ఈ తరహా వాక్సిన్ తీసుకువచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా’’ అని ఈ రోజు (మంగళవారం) రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనికి ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ జవాబిస్తూ ప్రభుత్వం టీబీ, డెంగ్యూ జబ్బులకు వాక్సిన్లను అభివృద్ధి చేస్తోందన్నారు. వ్యాక్సిన్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఆమోదం పొందిన తర్వాత ఈ రెండు వాక్సిన్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాసెస్ త్వరలోనే పూర్తయి, వాక్సినేషన్ షురూ అవుతుందని చెప్పారు.
అమెరికాలో 9 నుంచి 16 ఏళ్ళ మధ్య పిల్లల కోసం డెంగ్యూ వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్లో కూడా డెంగ్యూ వాక్సిన్ తీసుకువచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా అని ఈరోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిని ప్రశ్నించడం జరిగింది. pic.twitter.com/nZ3S5n95mV
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 30, 2021