ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురవుతోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా వైసీపీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. కుప్పం నియోజక వర్గంలో మొత్తం 89 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, 74 చోట్ల వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ 14 చోట్ల, కాంగ్రెస్ ఒకచోట విజయం సాధించింది. ఇక చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 264 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా ఏకగ్రీవాలు 91, వైసీపీ 145, టీడీపీ 28, కాంగ్రెస్ ఒకచోట విజయం సాధించింది. పల్నాడు ప్రాంతంలో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు.
see more news