చిత్తూరు జిల్లాలోని పూతలపట్టులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించివేశారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ నెలకొంది. నడిరోడ్డుపైనే ఒకరినొకరు తిట్టుకుంటూ రచ్చ రచ్చ చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి వైసీపీ నేతలు దగ్ధం చేయగా.. పోటీగా జగన్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టారు టీడీపీ కార్యకర్తలు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రెండు వర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు
ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్ఎస్ బాబు, కార్యకర్తలు.. మరోవైపు టీడీపీ నేతలు ఆందోళనలు ఉధృతం చేశారు. ఇప్పటికే ముందస్తుగా పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు
పుంగనూరు ఘటనపై వైసీపీ నేతలు ఆగస్టు 05 శనివారం బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో పుంగనూరులో రోడ్డుపైనే టీడీపీ నేతలు, కార్యకర్తలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు.దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.