ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 20 స్థానాలు మెరుగై 18వ ర్యాంకులో నిలిచాడు. బంగ్లాదేశ్తో తొలి టెస్టులో 5 వికెట్లు తీసిన అక్షర్.. 650 పాయింట్లతో టాప్-20లో స్థానం దక్కించుకున్నాడు. అటు కుల్దీప్యాదవ్ 19 స్థానాలు ఎగబాకి... 49వ ర్యాంకులో నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా (4), అశ్విన్ (5) టాప్ 10లో కొనసాగుతున్నారు.
అటు బ్యాటింగ్లో పుజారా 16వ ర్యాంకును దక్కించుకున్నాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన అతను.. 10 స్థానాలు మెరుగై 16వ ర్యాంకుకు చేరుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ 11 స్థానాలు మెరుగై 26వ ర్యాంక్ సాధించాడు. పంత్ 6, రోహిత్శర్మ 9, విరాట్ కోహ్లి 12వ స్థానాలకు పడిపోయారు.