భారత్ ఆస్ట్రేలియా మధ్య మంగళవారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ టీ20 మ్యాచ్ ఆడేందుకు టీమిండియా మొహాలీకి చేరుకుంది. మ్యాచ్కు మూడు రోజుల ముందుగానే మనోళ్లు మొహాలీలో దిగారు. మొహాలీ విమానాశ్రయంలో టీమిండియా క్రికెటర్లు కనిపించడంతో..అభిమానులు వీడియోలు, ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సతీమణితో బుమ్రా..
మొహాలీ ఎయిర్ పోర్టులో ఉదయం హర్షల్ పటేల్ కనిపించాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా తన సతీమణి సంజనా గణేషన్తో కలిసి దిగాడు. ఆసియా కప్ టోర్నీకి ముందు వీరిద్దరు గాయపడడంతో జట్టుకు ఎంపిక కాలేదు. ఈసారి ఇద్దరు జట్టులోకి రావడంతో టీమిండియా బౌలింగ్ బలంగా మారిందని చెప్పొచ్చు.
Bumrah looking more fitter pic.twitter.com/6AIuZu98Uh
— Cricket lover (@goria_pardeep) September 17, 2022
కోహ్లీ, డీకే రాక..
బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ సైతం మొహాలీ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చాడు. ఆసియాకప్ తర్వాత లండన్కు చెక్కేసిన కోహ్లీ..టీ20 సిరీస్ కోసం మళ్లీ ఇండియాకు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో మొహాలీ ఎయిర్ పోర్టులో దిగిన కోహ్లీ..ముఖానికి మాస్క్ ధరించాడు. కోహ్లీతో పాటు..దినేష్ కార్తీక్..కూడా మొహాలీలో కనిపించాడు.
Picture of Virat Kohli when he arrives in Mohali. pic.twitter.com/YmWDaVsMAD
— CricketMAN2 (@ImTanujSingh) September 17, 2022
Dinesh Karthik has arrived in Mohali for the first T20I. pic.twitter.com/exSowWUj1w
— Johns. (@CricCrazyJohns) September 17, 2022
ఆసీస్ టీ20 సిరీస్ కోసం టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్(షమీ రిప్లేస్ మెంట్) , హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా జట్టు : ఆరోన్ ఫించ్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్ వెల్, ఆస్టన్ ఆగర్, కెమరున్ గ్రీన్, డేనియల్ సామ్స్, సీన్ అబాట్, జోష్ ఇంగ్లిస్, మాథ్యు వేడ్, ప్యాట్ కమ్మిన్, జోష్ హాజిల్ వుడ్, కేన్ రిచర్డ్ సన్, నాథన్ ఎల్లిస్, అడమ్ జంపా