2022లో బెస్ట్ పర్ఫామెన్స్ చేసిన టీమిండియా క్రికెటర్ల జాబితాను టీమిండియా విడుదల చేసింది. టెస్టుల్లో బ్యాటింగ్ విభాగంలో రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నాడు. బౌలింగ్ విభాగంలో బుమ్రా ఎంపికయ్యాడు. వన్డేల్లో శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్లు సెలక్ట్ అయ్యారు. టీ20ల్లో బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్.. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్లకు బీసీసీఐ చోటు కల్పించింది.
పంత్, బుమ్రా ప్రదర్శన..
2022లో రిషబ్ పంత్ 7 టెస్టుల్లో 680 పరుగులు సాధించాడు. వీటిలో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. బుమ్రా ఐదు టెస్టుల్లో 20.31 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. రెండుసార్లు ఐదు వికెట్లు తీసుకున్నాడు.
వన్డేల్లో..
ఈ ఏడాది శ్రేయాస్ అయ్యర్ 17 మ్యచ్లు ఆడిన 55.69 సగటుతో 724 పరుగులు సాధించాడు. ఇందులో 6 అర్థ సెంచరీలున్నాయి. బౌలింగ్లో సిరాజ్ 15 మ్యాచుల్లో అతను 24 వికెట్లు తీశాడు.
టి20ల్లో..
2022లో టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్..31 మ్యాచుల్లో 1,164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, తొమ్మిది అర్థసెంచరీలున్నాయి. భువనేశ్వర్ కుమార్..32 టీ20ల్లో 37 వికెట్లు పడగొట్టాడు.