టీమిండియా టార్గెట్ 100 రన్స్

టీమిండియా టార్గెట్ 100  రన్స్

రెండో టీ20లో భారత్ బౌలర్లు దుమ్మురేపారు. అద్భుతమైన బౌలింగ్తో న్యూజిలాండ్ 99 పరుగులకే కట్టడి చేశారు. భారత బౌలర్ల ధాటికి పరుగులు చేయలేక చతికిలపడిన కివీస్..టీమిండియాకు కేవలం 100  పరుగుల స్వల్ప  టార్గెట్ ను నిర్దేశించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 99 పరుగులే చేసింది. అయితే 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. భారత బౌలర్ల ధాటికి తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఈ క్రమంలోనే  కేవలం 60 పరుగులకే కివీస్ సగం వికెట్లు కోల్పోయి పీకల్లతో కష్టాల్లో పడింది. 

ఈ సమయంలో బ్రేస్ వెల్ , సాంట్నర్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. సింగిల్స్ తీస్తూనే స్కోరు బోర్డును నడిపించారు. ఇదే క్రమంలో 6వ వికెట్ కు 20 పరుగులు జోడించారు. అయితే 14 పరుగులు చేసిన బ్రేస్ వెల్ ను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్  వికెట్లు మరోసారి టపటపా రాలాయి. వచ్చిన బ్యాట్స్ మన్ క్రీజులో ఉండటం కన్నా..పెవీలియన్ చేరుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపినట్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. చివరకు న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 99 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ రెండు వికెట్లు కోల్పోగా..పాండ్యా, సుందర్, చాహల్, హుడా, కుల్దీప్ యాదవ్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.