ఆఖర్లో బోల్తా.. ఆసీస్ తో మూడో వన్డేలో ఇండియా ఓటమి

ఆఖర్లో బోల్తా.. ఆసీస్ తో  మూడో వన్డేలో ఇండియా ఓటమి

రాజ్‌‌కోట్‌‌: వన్డే వరల్డ్‌‌ కప్‌‌కు ముందు ఆడిన ఆఖరి వన్డేలో టీమిండియా బోల్తా కొట్టింది. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో బ్యాటర్లు ఫెయిల్‌‌ కావడంతో.. బుధవారం జరిగిన మూడో వన్డేలో ఇండియా 66 రన్స్‌‌ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. దీంతో ఆసీస్​ను వైట్​వాష్​ చేయలేకపోయిన రోహిత్​సేన  సిరీస్‌‌ను 2–1తో సొంతం చేసుకుంది. టాస్‌‌ గెలిచిన ఆసీస్‌‌ 50 ఓవర్లలో 352/7 స్కోరు చేసింది. మిచెల్‌‌ మార్ష్‌‌ (96), స్మిత్‌‌ (74), లబుషేన్‌‌ (72), వార్నర్‌‌ (56) దంచికొట్టారు. 

బుమ్రా 3 , కుల్దీప్‌‌ 2 వికెట్లు తీశారు. తర్వాత ఇండియా 49.4 ఓవర్లలో 286 రన్స్‌‌కు ఆలౌటైంది. రోహిత్‌‌ శర్మ (81) టాప్‌‌ స్కోరర్‌‌. కోహ్లీ (56), శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (48), జడేజా (35), రాహుల్‌‌ (56) పోరాడి విఫలమయ్యారు. మ్యాక్స్‌‌వెల్‌‌ 4, హేజిల్‌‌వుడ్‌‌ 2 వికెట్లు తీశారు. మ్యాక్స్‌‌వెల్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌’ అవార్డులు లభించాయి.