టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న భారత్

టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న భారత్

ఇంగ్లాండ్తో జరగనున్న ఫస్ట్ వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్టులో చాలా రోజుల తర్వాత ధావన్ చోటు దక్కించుకున్నాడు. రోహిత్ కు జోడిగా ధావన్ ఓపెనింగ్ చేయనున్నాడు. అటు శ్రేయస్ అయ్యర్, హార్థిక్ పాండ్యా ప్లేయింగ్ లెవన్ లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో షమీ, బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ, చాహల్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆడటం లేదు.  అయితే గాయం కారణంగా కోహ్లీ ఆడటం లేదని..అతని స్థానంలో శ్రేయస్ ను తీసుకున్నట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు. 

తుది జట్టు:రోహిత్, ధావన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్థిక్ పాండ్య, రవీంద్ర జడజా, షమీ, బుమ్రా, చాహల్, ప్రసిద్ధ కృష్ణ