టిక్ టాక్ చాలెంజ్​ ప్రాణం మీదికొచ్చింది

టిక్ టాక్ చాలెంజ్​ ప్రాణం మీదికొచ్చింది

వాషింగ్టన్: అమెరికాలోని టీనేజర్లు టిక్ టాక్ చాలెంజ్​లతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. బెనడ్రిల్ చాలెంజ్​తో ఒహియో రాష్ట్రంలో ఓ టీనేజర్ చనిపోగా, ఇప్పుడు ఇంకో చాలెంజ్​తో నార్త్ కరోలినాలో మరో టీనేజర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 80% కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిండు. 16 ఏండ్ల మేసన్ డార్క్ ఏప్రిల్ 23న తన ఫ్రెండ్స్​తో కలిసి టిక్ టాక్ చాలెంజ్ చేశాడు. స్ర్పే పెయింట్ డబ్బా, లైటర్​తో మంటలు పుట్టించేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో డబ్బా భారీ శబ్దంతో పేలింది. మంటలు అంటుకోవడంతో భరించలేక మేసన్ డార్క్ పక్కనే ఉన్న నదిలో దూకాడు. ఆ వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించారు. మంటల ధాటికి తీవ్ర గాయాలయ్యాయని, నదిలో దూకడంతో ఇన్ఫెక్షన్ ఎక్కువైందని డాక్టర్లు చెప్పారు. ఇప్పటికే ఒక సర్జరీ చేశామని, మరిన్ని సర్జరీలు చేయాలని అన్నారు. తన కొడుకు కోసం ప్రార్థించాలంటూ మేసన్ డార్క్ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది.