
- అభ్యంతరాలుంటే ఈ నెల 20లోపు చెప్పాలని ఈసీ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: తీన్మార్ మల్లన్న తను స్థాపించబోయే కొత్త పార్టీని ‘తెలంగాణ నిర్మాణ పార్టీ’ పేరుతో ఎన్నికల కమిషన్కు అప్లై చేసుకున్నారు. పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాల్సిందిగా ప్రజలను ఈసీ కోరింది. ఈ మేరకు ఈసీ వెబ్సైట్లో ఒక ప్రకటన జారీ చేసింది. ఈ నెల 20వ తేదీలోపు అభ్యంతరాలు, ఫిర్యాదు స్వీకరిస్తామని తెలిపింది. తెలంగాణ నిర్మాణ పార్టీ అధ్యక్షుడుగా తీన్మార్ మల్లన్న, ప్రధాన కార్యదర్శిగా మాదం రజనీ కుమార్, కోశాధికారిగా ఆర్ భావన ఉన్నట్లుగా పేర్కొన్నది. కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్లో తీన్మార్ మల్లన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్టీ పేరును కూడా అప్పుడే వెల్లడించారు.