అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ లోనూ రిపీట్ 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ లోనూ రిపీట్ 

 

  • హైదరాబాద్ కు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు

  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క


హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ లోనూ రిపీట్ అవుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ఇందిరమ్మ రాజ్యం ఉందని తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని కోరారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే. రాష్ట్రంలో విలువైన భూములను ఆ పార్టీ నేతలు ఆక్రమించుకున్నరు. హైదరాబాదుకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. ప్రభుత్వంపై నోరు పారేసుకోవడం మానుకోవాలి. ప్రజలు తరిమికొట్టినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు కనిపించడం లేదు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం క్రమంగా బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయం’ అని స్పష్టంచేశారు.