రోజుకు 20 మంది ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ

రోజుకు 20 మంది ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ
  • టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ పేరు ప్రతిపాదిస్తూ నామినేషన్లు

టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్లు వేశారు జడ్పీ చైర్మన్లు. మరోవైపు నవంబర్ 15న వరంగల్ లో నిర్వహించనున్న విజయగర్జన సభకు సంబంధించి సన్నాహక సమావేశాలు ప్రారంభించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విజయగర్జన సభకు కేటీఆర్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించారు కేసీఆర్. సభకు 10 లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం ప్రతీ రోజూ 20 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు కేటీఆర్. ఇవాళ సిరిసిల్ల, కోరుట్ల, దుబ్బాక, సంగారెడ్డి, వికారాబాద్, పరిగి, తాండూర్, చేవెళ్ల, సూర్యాపేట, హుజూర్ నగర్, దేవరకొండ, తుంగతుర్తి, వనపర్తి, గద్వాల్, కొల్లాపూర్, ఆలంపూర్, కామారెడ్డి, బాన్స్ వాడా, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశమయ్యారు కేటీఆర్.

మరిన్ని వార్తల కోసం..

జనగామలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం

తెలంగాణలో 8 మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

కశ్మీర్‌కు వలసొచ్చినోళ్లు వెళ్లిపోవాలె.. టెర్రరిస్టుల వార్నింగ్