- జనగామలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
జనగామ జిల్లాలో జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాలిపోయింది. ఒక్కసారిగా బస్సులో మంటలు రావడంతో ప్రయాణికులు కేకలు వేశారు. దీంతో డ్రైవర్ బస్సును పక్కకు ఆపాడు. వెంటనే ప్రయాణీకులంతా బస్సు దిగారు. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ఉన్నారు. అంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికుల లగేజీ, బ్యాగులు కాలిపోయాయి. బస్సు... ఛత్తీస్ గఢ్ జగదల్ పూర్ నుంచి హైదరాబాద్ వస్తోంది. బస్సు ఫిట్ నెస్ లేకపోవడంతోనే షార్ట్ సర్క్యూట్ తో మంటలు వచ్చినట్టు తెలుస్తోంది.