సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చాయి. ట్రస్ట్ వెబ్ సైట్ ను చిరు తనయుడు రామ్ చరణ్ లాంచ్ చేశారు. మరిన్ని ప్రాంతాలకు చిరు బ్లడ్, ఐ బ్యాంక్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసమే వెబ్ సైట్ ప్రారంభించినట్లు తెలిపారు. దాదాపు 25 భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందన్నారు. దీంతో పాటు కె.చిరంజీవి పేరుతో మరో వెబ్ సైట్ ని చరణ్ ప్రాంభించారు. చిరంజీవి జీవితం, ఆయన నటించిన సినిమాలు, పాటలు, దర్శకనిర్మాతలతో ఆయనకున్న అనుబంధం గురించి.. ఈ వెబ్ సైట్ లో సమాచారం ఉంచామన్నారు చరణ్.
మరిన్ని వార్తల కోసం..