ఏటీఎం క్యాష్ వ్యాన్ దొంగ దొరికిండు..అనంతపురంలో డ్రైవర్ ను పట్టుకున్న సీసీఎస్ పోలీసులు 

ఏటీఎం క్యాష్ వ్యాన్ దొంగ దొరికిండు..అనంతపురంలో డ్రైవర్ ను పట్టుకున్న సీసీఎస్ పోలీసులు 
  •  రూ.57 లక్షల నగదులో రూ.30 లక్షలు రికవరీ

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​లో సంచలనం సృష్టించిన ఏటీఎం క్యాష్ వ్యాన్ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఏటీఎంలలో నింపాల్సిన రూ. 57 లక్షల నగదుతో పరారైన డ్రైవర్ అజిత్ కుమార్​ను 11 రోజుల సుదీర్ఘ గాలింపు తర్వాత ఏపీలోని అనంతపురంలో సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి నుంచి రూ. 30 లక్షల నగదును రికవరీ చేసి గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఈ నెల 12న ఐటీ కారిడార్ లోని​గోపన్​పల్లి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్దకు సంగం సెక్యూరిటీ సొల్యూషన్స్​సంస్థకు చెందిన సీఎంఎస్​వాహనం డబ్బులు డిపాజిట్​చేసేందుకు వచ్చింది. కస్టోడియన్లు లోపలికి వెళ్లడం, సెక్యూరిటీ గార్డు పక్కకు వెళ్లడం గమనించిన డ్రైవర్ అజిత్.. క్షణాల వ్యవధిలో నగదు వాహనంతో ఉడాయించాడు.

అనంతరం తెల్లాపూర్ వద్ద వ్యాన్​ను వదిలేసి, డబ్బు సంచులతో ఆటోలో లింగంపల్లికి, అక్కడ హోటల్ నుంచి అనంతపురానికి చెక్కేశాడు. అయితే, పోలీసులు సీసీ కెమెరాల నెట్​వర్క్​ను జల్లెడ పట్టి నిందితుడి ఆచూకీ కనిపెట్టారు. పరారీలో ఉన్న సమయంలో అజిత్ మిగిలిన నగదును ఎక్కడ ఖర్చు చేశాడు? ఎవరికైనా ఇచ్చాడా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.