ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్

ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్

హైదరాబాద్ : ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ 2022 నోటిఫికేషన్ రిలీజైంది. ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరించనున్నారు. అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని ఎంసెట్ కన్వీనర్ సూచించారు. మే 30 నుంచి జూన్ 6వ తేదీ వరకు దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు.

ఎంసెట్ ఇంజనీరింగ్ కోర్సు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసే అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ,దివ్యాంగ అభ్యర్థులు రూ.400, మిగతా కేటగిరీ క్యాండిడేట్లు రూ.800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రెన్స్ రాసే ఎస్సీ, ఎస్టీ,దివ్యాంగ అభ్యర్థులు రూ.800, మిగతా కేటగిరీల వారు రూ.1600 చెల్లించి ఆన్లైన్లో అప్లికేషన్ సమర్పించాలి. అగ్రికల్చర్, మెడికల్ ఎగ్జామ్ను జూన్ 14,15 తేదీల్లో, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను 18, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నారు.