తెలంగాణలో కేసీఆర్ రైతులను రాజు చేశారని మంత్రి హరీష్ రావు అన్నారు. 2023, నవంబర్ 12వ తేదీ ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో హరీష్ రావు సమక్షంలో ఓదెల జడ్పీటీసీ రాములు యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాములు యాదవ్ కు హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..
రైతుబంధు ఇస్తే బిచ్చం వేస్తున్నారని రేవంత్ రెడ్డి హీనంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతలను అవమానించారని.. రైతులంటే గౌరవం లేదని దయ్యబట్టారు. వ్యవసాయంపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదన్నారు.
కర్ణాటకలో ఐదు గంటలు కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్తున్నారని.. కానీ, కర్నాటకలో 2 గంటలు కూడా కరెంటు ఇవ్వట్లేదని జేడిఎస్ నేత కుమారస్వామి చెప్పారని అన్నారు. రైతులకు మూడు గంటల కరెంటు చాలని రేవంత్ రెడ్డికి అంటున్నారని.. ఆయనకు కనీసం హార్స్ పవర్ అంటే తెలుసా? ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో భూముల విలువ పెరిగిందని చెప్పారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ కు పోలిక ఉందా?... రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి చేతుల్లోకి పోతే రాష్ట్రం వెళ్లడం మంచిది కాదని హరీష్ రావు అన్నారు.