పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తా.. సోనియా గాంధీకి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తా.. సోనియా గాంధీకి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం

సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి జానారెడ్డి నిలవబోతున్నారు. ఆయన అసెంబ్లీ ఎన్నికలకు కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు జానారెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల్లో  పోటీ చేయడం లేదని వెల్లడించారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుటుంబం నుంచి బరిలో ఉంటారని జానారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తన కొడుకు పోటీ చేస్తారని చెప్పారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి ఐక్య వేదిక అవసరమని మల్లికార్జున ఖర్గేకు సూచించినట్లు జానారెడ్డి వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని చెప్పినట్లు వివరించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి రాష్ట్ర ప్రజలు అధికారాన్ని బహుమతిగా ఇవ్వాలని జానారెడ్డి కోరారు.