V6 News

Telangana Global Summit : తెలంగాణలో రూ. 5 లక్షల 75 వేల కోట్ల పెట్టుబడులు

Telangana Global Summit : తెలంగాణలో రూ. 5 లక్షల 75 వేల కోట్ల పెట్టుబడులు

 తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్రానికి రికార్డ్ స్థాయి పెట్టుబడులు వచ్చాయి. రెండు రోజుల్లో దేశ,విదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీల నుంచి మొత్తం రూ. 5 లక్షల 75 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అత్యధికంగా విద్యుత్ రంగంలో రూ. 3లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. 

హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్  రెండో రోజు కూడా  భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు పారిశ్రామిక వేత్తలు.  రెండో రోజు 2 లక్షల 96  వేల 995  కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి పలు జాతీయ ,అంతర్జాతీయ కంపెనీలు.  మొదటి రోజు 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగిన సంగతి తెలిసిందే.  మొత్తం రెండు రోజుల్లో  5 లక్షల 75 వేల కోట్ల పెట్టుబడులకు తెలంగాణ  ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. దీంతో లక్షలాది ఉద్యోగాలు రానున్నాయి. 

రెండో రోజు ఒప్పందాలు

 

  • ఫెర్టిస్ ఇండియా 2 వేల కోట్ల పెట్టుబడులు
  • ఫుడ్ అండ్ బేవరేజస్ యూనిట్ విస్తరణకు కేజేఎస్ ఒప్పందం
  •  జేఎసీ కే 9 వే లకోట్ల పెట్టుబడులకు ఒప్పందం
  •  ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ తయారీ యూనిట్ కు ఆర్సీపీఎల్ ఒప్పందం
  • ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ సేవల విస్తరణకు కైన్స్ టెక్నాలజీ ఒప్పందం
  •  భారత్ బయోటిక్ రూ. 1000 కోట్ల పెట్టబడులు
  • గోద్రేజ్ రూ. 150 కోట్ల పెట్టుబడులు
  • ఏఐ రెడీ డేటా పార్క్ రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు
  • అరబిందో రూ. 2 వేల కోట్ల పెట్టుబడులు 
  • కేజేఎస్ ఇండియా రూ. 650 కోట్లు
  • హెటిరో గ్రూప్ 1800 కోట్లు
  • రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 1500 కోట్లు