తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్రానికి రికార్డ్ స్థాయి పెట్టుబడులు వచ్చాయి. రెండు రోజుల్లో దేశ,విదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీల నుంచి మొత్తం రూ. 5 లక్షల 75 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అత్యధికంగా విద్యుత్ రంగంలో రూ. 3లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి.
హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కూడా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు పారిశ్రామిక వేత్తలు. రెండో రోజు 2 లక్షల 96 వేల 995 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి పలు జాతీయ ,అంతర్జాతీయ కంపెనీలు. మొదటి రోజు 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం రెండు రోజుల్లో 5 లక్షల 75 వేల కోట్ల పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. దీంతో లక్షలాది ఉద్యోగాలు రానున్నాయి.
రెండో రోజు ఒప్పందాలు
- ఫెర్టిస్ ఇండియా 2 వేల కోట్ల పెట్టుబడులు
- ఫుడ్ అండ్ బేవరేజస్ యూనిట్ విస్తరణకు కేజేఎస్ ఒప్పందం
- జేఎసీ కే 9 వే లకోట్ల పెట్టుబడులకు ఒప్పందం
- ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ తయారీ యూనిట్ కు ఆర్సీపీఎల్ ఒప్పందం
- ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ సేవల విస్తరణకు కైన్స్ టెక్నాలజీ ఒప్పందం
- భారత్ బయోటిక్ రూ. 1000 కోట్ల పెట్టబడులు
- గోద్రేజ్ రూ. 150 కోట్ల పెట్టుబడులు
- ఏఐ రెడీ డేటా పార్క్ రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు
- అరబిందో రూ. 2 వేల కోట్ల పెట్టుబడులు
- కేజేఎస్ ఇండియా రూ. 650 కోట్లు
- హెటిరో గ్రూప్ 1800 కోట్లు
- రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 1500 కోట్లు

