ఆఫీసులకు రాకండి..  వాట్సాప్ చేయండి

ఆఫీసులకు రాకండి..  వాట్సాప్ చేయండి

గేట్లకు తాళాలు, ఎంట్రెన్స్లో కాంప్లెయింట్ బాక్సులు

పబ్లిక్ రాకుండా నో ఎంట్రీ బోర్డులు
కరోనా తీవ్రతతో జిల్లాల్లో ఆఫీసర్ల చర్యలు
గ్రీవెన్స్ రద్దుతో జనం పరేషాన్
సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని ఆవేదన

కరోనా తీవ్రత కారణంగా గవర్నమెంట్ ఆఫీసులకు నో ఎంట్రీ బోర్డులు పెడుతున్న ఆఫీసర్లు, ‘వాట్సప్ సర్వీస్ ఓన్లీ’ అంటున్నరు. ఎలాంటి సమస్యలున్నా వాట్సాప్కు గాని, మెయిల్కు గాని కాంప్లెయింట్స్ పంపాలని, ఎట్టి పరిస్థితుల్లో ఆఫీసులకు రావద్దని చెబుతున్నరు. తహసీల్దార్, ఎండీఓ, ఆర్డీఓ ఆఫీసులు, పోలీస్స్టేషన్లు.. ఇలా అన్నిచోట్లా గేట్లకు తాళాలేసి అక్కడే కాంప్లెయింట్ బాక్సులు పెడుతున్నరు. ఆఫీసుల చుట్టూ ఒకటికి పదిసార్లు చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకోని ఆఫీసర్లు, వాట్సాప్ మెసేజ్లు, కాంప్లెయింట్ బాక్సులు చూసి సమస్యలు పరిష్కరిస్తారంటే తమకు నమ్మకం కలగడంలేదని జనం అంటున్నరు.

నో ఎంట్రీ బోర్డులు..
జిల్లాల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చాలామందికి కరోనా ఉన్నా లక్షణాలు లేకపోవడంతో బయటే తిరుగుతున్నారు. వివిధ పనుల మీద ప్రభుత్వ ఆఫీసులకు, బ్యాంకులకు, పోలీస్స్టేషన్లకు వస్తున్నారు. ముఖ్యంగా భూసమస్యలు నేటికీ పరిష్కారం కాకపోవడం, రైతుబంధు రాకపోవడంతో చాలా మంది రైతులు తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వివిధ సర్టిఫికెట్లు, పర్మిషన్ల కోసం ఆయా కార్యాలయాలకు వస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ఆఫీసర్లు, స్టాఫ్ కరోనా బారినపడుతున్నారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసీల్దార్ మల్లేశ్ ఐదు రోజుల క్రితం కరోనాతో చనిపోయారు. దీంతో ఆఫీసర్లలో భయం మొదలైంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాకేంద్రాలు,మండలాల్లోని వివిధ ప్రభుత్వ ఆఫీసుల్లో సేఫ్టీ చర్యలు తీసుకుంటున్నారు. కేవలం స్టాఫ్ను మాత్రమే లోపలికి అనుమతించి, బయట గేట్లకు తాళాలు వేయిస్తున్నారు. పబ్లిక్కు ప్రవేశం లేదని బోర్డులు, బ్యానర్లు పెడుతున్నారు. పక్కనే కాంప్లెయింట్ బాక్సులు పెట్టి, అర్జీలను అందులో వేయాలని ప్రజలకు సూచిస్తున్నారు.

వాట్సాప్ సర్వీస్..
కరోనాతో మార్చి నుంచే అన్ని ఆఫీసుల్లో గ్రీవెన్స్ను రద్దుచేశారు. దీంతో వివిధ సమస్యలపై ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని కామన్ పబ్లిక్ రోజూ ఆయా కార్యాలయాలకు వచ్చిపోతున్నారు. వీరి నుంచి కరోనా ప్రబలుతోందని అనుమానిస్తున్న కలెక్టర్లు, రెవెన్యూ ఆఫీసర్లు ఆయా జిల్లాల్లో వాట్సాప్ సేవలు ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‍జిల్లా అంతటా ఆన్‍లైన్ సేవలు అందిస్తున్నారు. ఇందుకోసం తమ వాట్సాప్ నంబర్లను పబ్లిక్కు అందుబాటులో ఉంచుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ఒక తహసీల్దార్ కరోనాతో చనిపోవడంతో అలర్ట్ అయిన ఆఫీసర్లు కార్యాలయాలకు తాళాలువేస్తున్నారు. తాజాగా మారుమూలన ఉన్న ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఆఫీసర్లు ఆన్లైన్ సర్వీస్ అందిస్తున్నారు. మూడురోజుల క్రితం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రివ్యూ మీటింగ్ నిర్వహించి, గవర్నమెంట్ ఆఫీసులకు పబ్లిక్ రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పరిష్కారంపై అనుమానాలు..
మార్చిలో గ్రీవెన్స్ రద్దయినప్పటి నుంచి జిల్లాల్లో సామాన్యుల సమస్యలను పట్టించుకునేవారు లేకుండాపోయారు. రాజకీయ పలుకుబడి ఉన్నవారు, చదువుకున్నవారు తమ సమస్యలను పరిష్కరించుకోవడంలో ముందుంటున్నారు. ఎటొచ్చీ నిరక్షరాస్యులైన రైతులు, ఇతర వర్గాలవారే ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారంతా గతంలో గ్రీవెన్స్ను ఆశ్రయించేవారు. అది రద్దుకావడంతో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తీరా ఇప్పుడు కాంప్లెంట్ బాక్సులు, ఆన్లైన్, వాట్సాప్ సేవలు అంటుండడంతో వారికి ఏమీ అర్థం కావడం లేదు.

For More News..

మమత సర్కారును డిస్మిస్‌‌‌‌‌‌‌‌ చేయండి

ఆస్తి కోసం నిప్పంటించి చంపిన్రు