- రవాణాశాఖ కమిషనర్గా ఇలంబర్తి
- ఫ్లాగ్షిప్ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విభాగం స్పెషల్ సీఎస్గా సబ్యసాచి ఘోష్
- శ్రీధర్కు జీఏడీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: ఎనిమిది మంది ఐఏఎస్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్లాగ్షిప్ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విభాగం ప్రత్యేక సీఎస్గా సబ్యసాచి ఘోష్ నియమితులయ్యారు. సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్గానూ ఆయన కొనసాగనున్నారు. కె.ఇలంబర్తి రవాణా శాఖ కమిషనర్గా బదిలీ అయ్యారు. పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలనూ ఆయనకే అప్పగించారు.
ఇక ఇలంబర్తి చూస్తున్న మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శి బాధ్యతలు సీఎస్ వద్దే ఉంచుకున్నారు. అనితా రామచంద్రన్కు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్గా అదనపు బాధ్యతలను అప్పగించారు. శ్రీధర్కు జీఏడీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. టీజీ ఆయిల్ ఫెడ్ ఎండీగా యాస్మిన్ బాషాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జి.జితేందర్ రెడ్డిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్గా నియమించారు. అలాగే, ఎస్సీ సహకార సంస్థ ఎండీగా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించారు. అభివృద్ధి సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
రిటైర్డ్ అయ్యే రోజే ఈఎన్సీ అనిల్కు పోస్టింగ్
ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ జనరల్ అనిల్కు ప్రభుత్వం ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చింది. 5 నెలలుగా హోల్డ్లో పెట్టిన ఇరిగేషన్ శాఖ.. శుక్రవారం ఆయన రిటైర్ అయ్యే రోజునే బాధ్యతలు అప్పగించింది. కరీంనగర్ ఈఎన్సీగా పోస్టింగ్ ఇస్తూ శుక్రవారం ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ శ్రీధర్ ట్రాన్స్ఫర్ను ఆపి.. ఆయనకు లాభం చేశారన్న కారణంతో జూన్లో ఈఎన్సీ అనిల్ను విధుల నుంచి తప్పించింది. అనిల్ రిటైర్మెంట్ అక్టోబర్ 31న ఉండడంతో.. అదే రోజు ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది.
