హైదరాబాద్, వెలుగు: స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా ఆదివారం రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై శ్రమదానంలో పాల్గొన్నారు. కార్మికులతో కలిసి పిచ్చి మొక్కలను, చెత్తను తొలగించారు. సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, తమ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
ఇది సమిష్టి బాధ్యతగా ఫీల్ అవ్వాలని గవర్నర్ పిలుపునిచ్చారు. రాజ్ భవన్ను ఎకో ఫ్రెండ్లీగా, గ్రీనరీగా ఉంచుతున్న కార్మికులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.