శుభ్రతను బాధ్యతగా ఫీల్ అవ్వాలి: గవర్నర్ తమిళిసై

శుభ్రతను బాధ్యతగా ఫీల్ అవ్వాలి: గవర్నర్ తమిళిసై

హైదరాబాద్, వెలుగు: స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా ఆదివారం రాజ్ భవన్​లో గవర్నర్ తమిళిసై శ్రమదానంలో పాల్గొన్నారు. కార్మికులతో కలిసి పిచ్చి మొక్కలను, చెత్తను తొలగించారు.  సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, తమ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

ఇది సమిష్టి బాధ్యతగా ఫీల్ అవ్వాలని  గవర్నర్ పిలుపునిచ్చారు.  రాజ్ భవన్​ను ఎకో ఫ్రెండ్లీగా, గ్రీనరీగా ఉంచుతున్న కార్మికులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.