చారిత్రక కట్టడాల దగ్గర మ్యాప్ ను అందించండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

చారిత్రక కట్టడాల దగ్గర మ్యాప్ ను అందించండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: పాతబస్తీలో మెట్రో నిర్మాణ విషయంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇవాళ(నవంబర్ 6) హైకోర్టు విచారణ చేపట్టింది. మెట్రో నిర్మాణాల వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని, పురావస్తు అనుమతి కూడా తీసుకోలేదని ఏపీడబ్ల్యూఎఫ్ పిటిషన్ దాఖలు చేసింది. చారిత్రక కట్టడాల సమీపంలో ఎలాంటి పనులు చేపట్టొద్దని నిబంధనలున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం తరపున ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. 

►ALSO READ | JNU విద్యార్థి సంఘాల ఎన్నికల్లో వామపక్ష కూటమి విజయం

పాతబస్తీ అభివృద్ధికి మెట్రో ఎంతో కీలకమని కోర్టుకు వివరించారు.మెట్రో రెండో దశ డిజైన్, నిర్మాణ పనుల గురించి ప్రధాన న్యాయమూర్తి ఏఏజీని ప్రశ్నించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు సెకండ్ఫేజ్ మెట్రో పనులు చేపట్టినట్లు ఏఏజీ వివరించారు. అభివృద్ధి పనులను అడ్డుకోవడానికే పిటిషన్ దాఖలు చేశారన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. నిర్మాణ పనులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని కోరింది. నిర్దేశిత చారిత్రక కట్టడాల వద్ద మెట్రో నిర్మాణానికి సంబంధించిన మ్యాప్ను సమర్పించాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్  18కి వాయిదా వేసింది.