ముంబైలో జగిత్యాలవాసి కిడ్నాప్

ముంబైలో జగిత్యాలవాసి కిడ్నాప్

జగిత్యాల జిల్లాకు చెందిన శంకరయ్య ముంబయిలో కిడ్నాప్ అయ్యారు. విదేశాల నుంచి ముంబయి ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనను విమానాశ్రయం బయటకు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. శంకరయ్యది జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన శంకరయ్యను విడిచిపెట్టేందుకు కిడ్నాపర్లు రూ. 15 లక్షలు డిమాండ్ చేశారు. ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసుకున్న ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కిడ్నాపర్లు శంకరయ్య కుటుంబ సభ్యులను బెదిరిస్తున్న ఆడియో బయటికి వచ్చింది. రూ. 15 లక్షలు ఇవ్వని పక్షంలో శంకరయ్యను చిత్రహింసలకు గురిచేస్తామని బెదిరించాడు. ఒక్కో రోజు ఒక్కో వేలు కట్ చేస్తారని చెప్పడంతో కుటుంబసభ్యులు భయపడిపోతున్నారు. మధ్య తరగతికి చెందిన తాము.. అంత మొత్తం ఇచ్చుకోలేమని చెప్పినా కిడ్నాపర్లు వినడం లేదని కుటుంబసభ్యులు వాపోతున్నారు. ఇంటర్నెట్ కాల్ చేసిన కిడ్నాపర్లు తమిళ, మలయాళ భాషల్లో మాట్లాడినట్లు వారు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, శంకరయ్యను క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.