గ్రేటర్ హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో రోడ్లు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు మునిగిన ఘటనలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేశారు. భారీ వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ పండుటాకులా వణికిపోతోందని, హైదరాబాద్ ను విశ్వనగరంగా చెప్పే మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
?నువ్వు నిర్మించిన విశ్వనగరం జల విలయంతో విలవిలలాడుతోంది. పండుటాకులా వణికిపోతోంది.
— Revanth Reddy (@revanth_anumula) September 5, 2023
?హైటెక్ హంగుల వీడియోలు, ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో భ్రమలు కల్పించే కేటీఆర్… ఇప్పుడెక్కడ? మనిషి కనిపించడం లేదు… మాట వినిపించడం లేదే!!#Dramarao #ByeByeKCR