తెలంగాణలో భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ

తెలంగాణలో భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ

తెలంగాణలో వచ్చే ఐదు రోజుల (జూన్ 25 నుంచి)  పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  24గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నెల 25,26,27 తేదీల్లో మరోసారి వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.  రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు.. మెరుపులతో కూడిన  వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈనెల 22 వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి.

ఉత్తర తెలంగాణలోని ఎనిమిది జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కొమరం భీమ్, నిర్మల, జగిత్యాల,మంచిర్యాల, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు.  హైదరాబాద్ లో  మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉంది.  పగలు అంతా సాధారణ పరిస్థితి ఉన్న.. సాయంత్రానికి వెదర్ చేంజ్ అవుతుంది. 

తెలంగాణ మీదుగా దక్షిణ ఝార్ఖండ్‌ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ధ్రోఫి కొనసాగేతుందని వాతావరణ శాఖ వివరించింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన వడగళ్ల వానలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేల సంఖ్యలో పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, వరి, మామిడి, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా మరోసారి వడగళ్ల వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రైతులు ఆందోళన చెందుతున్నారు